Monday, June 05, 2006

దేవుడున్నాడా? -- dEvuDunnADA?


పుణ్యాత్ముని మరియు దుర్మార్గుని పట్ల డేవుడు ఒకే పక్షపాతం చూపిస్తాడా?
పాప పుణ్యాల కర్మ పలితాలు తర్వాతి జన్మలకు అనుసరిస్తాయా?
అసలు పునర్జన్మలంటూ ఉన్నాయా?
ఏది పాపం? ఏది పుణ్యం?
జన్మ యొక్క పారమార్థికత ఏమిటి?
మోక్షం అనగా ఏమిటి? అది ఎలా సిద్దిస్తుంది?
ఇహ లోకంలో లేని స్వర్గనరకాలు పరలోకంలో ఉన్నాయా?
వివిధ మతాలు మనిషిలో పాపభీతి కలిగించుటలో ప్రవక్తల, సాదు జనుల, దైవావతారుల అంతర్లీన భావ మేమిటి?
డేవుడు నిర్వికారుడూ, నిర్గుణాకారుడా?
అతని పేరు మీద భజనలు, భక్తి, తంత్రాలు, మంత్రాలు అవసరమా?
ఏది అసలైన దైవ సేవ?
అసలు పాపభీతితో దైవసేవ చేయటం అవసరమా?
నా అభిప్రాయాలు తర్వాతి బ్లాగులో.. మీ అభిప్రాయాలు చెప్పండి.

ఉచల్యా - లక్ష్మణ్ గాయక్‌వాడ్ ఆత్మకథ ( uchalya )


ఉచల్యా - లక్ష్మణ్ గాయక్‌వాడ్ ఆత్మకథ
మన మద్యనే మనకు తెలియని ప్రపంచం ఎంత ఉంది?
ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదివి తీరవలసిన పుస్తకం. దాదాపు ఇప్పుడు ఇంటెర్నెట్లో ఇది చూస్తున్న ప్రతిఒక్కరు తమ బాల్యంలో తిండికి గతిలేనివారు మాత్రం అయి ఉండరు. అలాగే తిండికి లేని వారిని, బిచ్చమెత్తుకునే వారిని చూసి ఉంటారు గాని.. వాళ్ళ జీవితాన్ని, కష్టాలను, ఆకలిని గూర్చి తెలుసుకోవాలంటే మాత్రం ఈ పుస్తకం చదివి తీరవలసిందే.
నాకు ఏడ్పు తెప్పించిన కొన్ని పేరాలు చదవండి.
"స్కూలుకి నేను వెళ్తూనే ఉన్నాను. కాని ఇంటి దగ్గర తినడానికి మాత్రం తిండిలేదు. ఒక్కొక్కసారి నాలుగైదు రోజులు ఇంట్లో పొయ్యి కూడా వెలిగించేవాళ్ళం కాదు. నేను అందరిలోకి చిన్నవాడినని నాన్న తను పనిచేసే చోటికి పిలిచేవాడు. యజమాని తనకు ఇచ్చిన రొట్టెలలో సగం నాకు ఇచ్చేవాడు. నాన్న సగం కడుపు నింపుకుని లేచేవాడు. అప్పుడప్పుడు ఇంట్లో బోలెడు నీళ్ళు పోసి గటిక కాచేవాళ్ళము. ఒక్కొక్కసారి అది కూడా దొరికేది కాదు. మా ఇంట్లో మనుషులు ఎక్కువ సంపాదన తక్కువ. రేషన్ దుకాణం నుండి ఎర్ర జొన్నలు తెచ్చుకునేవాళ్ళం. ఆ జొన్నల్లొ బోలెడు పురుగులు ఉండేవి. మాకు ఎంత ఆకలి వేసేదంటే పురుగులు ఉన్నా సరే వేడి వేడిగ ఉన్న ఆ గటికను తాగేవాళ్ళం. అందరికి నాలుగు నాలుగు చెంచాలకన్నా ఎక్కువ వచ్చేది కాదు. ఇద్దరన్నయ్యల్లో ఎవరో ఒకరు నాకు మళ్ళీ కాస్తో కూస్తో గటిక ఇస్తారని వాళ్ళతోబాటు నేను కూర్చొనేవాడిని. కాని మా వదినలకి అన్నయ్యల భాగం నేను తినడం ఇష్టం ఉండేది కాదు. నన్ను తిట్టేవాళ్ళు. నేను సిగ్గులేనివాడిలాగా అట్లాగే కూర్చుండేవాడిని. నేను కంచాలు కూడా నాకే వాడిని. అయినా నాకు ఆకిలి తీరేది కాదు. గిన్నెలో అడుగున మాడిన చెక్కల సైతం గీక్కుని గీక్కుని తినేవాడిని. ఒక్క పూట అయినా కడుపునిండా అన్నం దొరికేది కాదు.
...
"ధోండాబాయి పోలీసుల కాళ్ళు పట్టుకుంది. వాళ్ళు బూట్లతో తన్నడం మొదలు పెట్టారు. "నిన్న లాతూరులో ఎవడో జేబు కొట్టేసాడు. ఐదొందుల రూపాయలు పోయాయి. నీ పిల్లలు తీసుకు వచ్చారు. చెప్పు వాళ్ళెక్కడ ఉన్నారో, ఆ డబ్బు తీసుకురా లేకపోతే జైళ్ళో పడేస్తాం." అని పోలీసులు బెదిరించారు. "ఐదొందలు తెచ్చి ఇవ్వు. మేం పాటిల్ దగ్గర ఉంటాం." అని అన్నారు. నాన్న యజమాని దగ్గరకు వెళ్ళి సంవత్సరం జీతం తీసుకు వచ్చాడు. అమ్మ ఒక షావుకారు దగ్గర వారంకి ఐదు రూపాయల వడ్డీ చొప్పున పైసలు తెచ్చింది. పోలీసులు బాగా తాగి వచ్చారు. అమ్మ పైసలు ఇచ్చింది. వీళ్ళందరిని జైలుకు తీసుకు పోదాం అని పోలీసులు అరవడం మొదలు పెట్టారు. ఓ దుప్పటి కాసిన్ని గిన్నెలు తీసుకున్నారు. "మై బాప్ మా పిల్లవాడు దొంగతనం చేయలేదు కేసు పెట్టకండి" అని నాన్న పోలీసులతో అన్నాడు. పోలీసులకు పైసలు ఇచ్చాక మమ్మల్ని విడిచి వేసారు."
...
ఇలాంటివి ఇందులో ఎన్నో ఉన్నాయి. మన పక్కనే ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే చుస్తూ ఊరుకుని, ఏమీ పట్టనట్టు, తెలియనట్లు, తెలిసినా కాసిన్ని కన్నీరు కార్చి, అలంటి బుక్ వ్రాసిన వాన్ని హీరోని చేసి లేదా అలాంటి సినిమాని సూపర్ హిట్ చేసి.. మన పని అయిపోయింది అనుకుంటున్నాం. మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నాం.
వీటికి ఎదురి నిల్చి పోరాడే ధైర్యం ఎంతమందికి ఉంది? కనీసం మన చుట్టు జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కొంతవరకైనా ఆపగలమా?
ఎంతసేపు మన పొట్ట, మన పిల్లలు, మన ఆస్తి చుసుకోవడంలోనే జివితం అంతా ఖర్చు ఐపోతోంది. ..

Friday, June 02, 2006

గాంధి గారి సత్యంతో ప్రయోగాలు -- నా సందేహాలు:

ఎప్పట్నుంచో అనుకుంటూ ఇప్పటికి "గాంధి గారి సత్యంతో ప్రయోగాలు" చదవడం సాద్యపడింది.ఎన్నో సార్లు నాకు తెలియకుండానే నా కంట్లో నీరు కారింది. కస్తూరిబ పడిన బాధలు తల్చుకుంటే గుండె ద్రవించింది. ఈ రోజుల్లో ఐతే ఏ ఇల్లాలు ఐనా గాంధీ గారికి విడాకులు ఇచ్చి ఉండేది.తనకున్న జ్ఞానమే అసలైన జ్ఞానమని ఆయన ఎలా అనుకున్నాడో?పైగా తను నమ్మిన సిద్దాంతాన్ని తన బార్య తప్పనిసరిగా పాటించలి అని ఎలా అనుకున్నాడో? అహింసను ఆరాదిస్తూనే యుద్దనికి సహాయపడటం ఏమిటి? ఇందుకు తను ఇచ్చిన వివరణ నాకెందుకో సరైనదిగా అనిపించలేదు. బహుశా శతృవుకు (తను ఎవిరిమీద పొరాటం చేస్తున్నాడో వారికి) సహయం చెయ్యడంలో ఉన్న ఆనందం, అహింస మేద ఉన్న భక్తిని మించి పోయి ఉంటుందేమో?
సాదా జీవనం అమలు చేయటంలో కూడా ఒక్కోసారి రాజీ పడ్డాడని పించింది.ఏదైనా అనుకున్న సిద్దాంతాన్ని అమలు చేయటంలో ఇబ్బంది ఎదురైతే అవి మౌనంగా అనుభవించాలన్నాడు. కాని ఒక సందర్భంలో మూడవ తరగతిలో స్థలం లేక స్థలం ఉన్న ఎక్కువ ఖరీదైన పెట్టెలోకి మారాడు. ఇంకోచోట ఆరుబయట స్నానం చేయల్సి వచ్చేసరికి కస్తురిబా ఎగువ తరగతి వారి స్నానపు శాలలో స్నానం చేయడానికి అడ్డు చెప్పలేదు. ఐతే వేటి అన్నింటినీ ఆయన స్వచ్చంగా ఒప్పుకున్నాడనుకోండి.ఐతే ఇలాంటి సమయాన్ని బట్టి సర్దుకోవడం, బార్య, కొదుకు మంచమ్మీద రోగంతో ఉన్నపుడు, డాక్టర్లు చెప్పినట్లు (మాంసం చారు గాని గుడ్డు కాని ఇవ్వడనికి) ఒప్పుకోలేదు.సత్య ఉల్లంగన చిన్న విశయంలో జరిగనా పెద్ద విశయంలో జరిగినా, ఉల్లంఘనా తీవ్రత ఒక్కటే కాదా? మాంసాదులతో పాటు పాలు కుడా మానివేసినాయన మేక పాలు మాత్రం ఎందుకు పుచ్చుకున్నట్లు? ఐతే దీనికి తను చింతించాడు అనుకోంది. కాని బార్య అనారోగ్యం విశయంలోను, కొదుకు అనారోగ్యం విశయంలోను అలంటి రాజీకి రాలేక పోయాడు.
బ్రహ్మచర్యం విశయంలోనూ నాకు సందేహాలే.కామము, భోగం తుచ్చమైనవి ఎలా ఔతాయో నాకు బోధపడదు. ఇందుకు ఆయన భగవద్గీత నుంచి ప్రభావశీలి ఐనట్లుగా అనిపిస్తుంది.కాని నాకు తెలిసిన కొద్ది జ్ఞానంతో ఆలోచిస్తే, గీతలో భగవంతుదు, "నిష్కామ" (కామము అనగా కోరిక లేని కర్మ) చేయాలంటాడు కదా? దీన్ని కూడా అ కోవలో అర్తం చేసుకోలెమా?ఈ విశయంలో నేను చలంను సమర్థిస్తాను. ఇద్దరూ సుఖించగల కార్యం పాప కార్యం ఎలా అవుతుంది?దీని మీద మరోసారి చర్చిద్దాం.
ఇలాంటివే సందేహాలు ఇంకా చాలా కలిగాయి.
అయితే ఒక్క విశయం మాత్రం స్పష్టం. సత్యం మీద ఆయన చిత్తశుద్ది అమోఘం. శుద్దాత్మ శక్తి మీద ఆయనకున్న విశ్వాసం స్వచ్చం. గాంధీ గారికి లభించిన ఆదరణే శుద్దాత్మ శక్తికి ప్రబల నిదర్శనం.నీతి, ధర్మం, స్వచ్చత, వినయం మనిషిని ఉన్నతుని చేస్తాయనడంలో నాకు ఇసుమంతైనా అనుమానం లేదు.
సమయాబవం వల్ల ఇక్కడితొ ఆపెస్తున్నను.మరోసారి మరిన్ని విశయాలతో...
మీ అబిప్రాయాలు, సద్విమర్షలకు స్వాగతం.
-- స్పందన